
- క్వాలిటీ ఎడ్యుకేషన్ కోసం కొత్త పాలసీ సిద్ధం చేస్తున్నాం : మంత్రి సీతక్క
ఏటూరునాగారం, వెలుగు : బీఆర్ఎస్ ప్రభుత్వం విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టించిందని, గతంలో స్టూడెంట్లకు బుక్స్, యూనిఫామ్స్ కూడా ఇవ్వలేకపోయారని మంత్రి సీతక్క విమర్శించారు. ములుగు జిల్లా ఏటూరునాగారం జడ్పీహెచ్ఎస్లో స్టూడెంట్లకు గురువారం బుక్స్, యూనిఫామ్స్ అందించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ విద్య వ్యవస్థపై సీఎం రేవంత్రెడ్డి ప్రత్యేక శ్రద్ధ పెట్టారన్నారు.
క్వాలిటీ ఎడ్యుకేషన్ కోసం కొత్త పాలసీని సిద్ధం చేస్తున్నారన్నారు. అనంతరం ఏటూరునాగారం బస్ డిపో నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ములుగు, మంగపేటలో బస్టాండ్లు నిర్మించడంతో పాటు ములుగు కలెక్టరేట్కు ఎదురుగా ఉన్న గట్టమ్మ ఆలయం వద్ద కూడా మినీ బస్టాండ్ నిర్మిస్తామని హామీ ఇచ్చారు. 2026లో జరిగే మేడారం జాతర నాటికి డిపో పనులను పూర్తి చేయాలని ఆఫీసర్లకు సూచించారు.
అనంతరం స్థానిక గిరిజన భవన్లో ఇందిరమ్మ లబ్ధిదారులకు మంజూరు పత్రాలు అందజేశారు. నియోజకవర్గానికి 3,500 ఇండ్లు మంజూరు అయినప్పటికీ, ఐటీడీఏను దృష్టిలో పెట్టుకుని అదనంగా మరో 1500 ఇండ్లు మంజూరు చేసినట్లు చెప్పారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ మహేందర్, ఐటీడీఏ పీవో చిత్రామిశ్ర, డీఆర్డీవో సంపత్రావు, వరంగల్ రీజియల్ ఆర్ఎం విజయభాను పాల్గొన్నారు.